నీరా కేఫ్ కు ఈనెల 23న శంకుస్థాపన

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్ కు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి ఛాంబర్ లో గౌడ ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులు మరియు అధికారులతో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా నీరా కేఫ్ కు సంబంధించిన ప్రతిపాదిత నమూనాను పరిశీలించి, దానిపై వారు చర్చించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులను ప్రత్యేకంగా మంత్రి అహ్వానించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శాసన సభ డిప్యూటి స్పీకర్ శ్రీ తీగుళ్ల పద్మరావు గౌడ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ, శ్రీ. గంగాధర్ గౌడ్ గారు, శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ వివేకనంద గౌడ్ గారు, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ లు శ్రీ రాజేషం గౌడ్ గారు, శ్రీ నాగేందర్ గౌడ్ గారు, మజీ శాసన మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ గారు, జిల్లా పరిషత్ ఛైర్మన్ & వైస్ చైర్మన్ లు, మరియు మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ ఎంపీ లు మరియు ఎన్నో ఎళ్ళు గా గౌడ సామాజిక వర్గానికి సేవలు అందిస్తున్న నాయకులు మరియు జె ఎ సి నాయకులు ఈ కార్యక్రమనికి ఇదే ఆహ్వానంగా భావించి కోవిడ్ నిబందనలను దృష్టిలో పెట్టుకోని వివిధ సంఘాల అధ్యక్ష , కార్యదర్శులు మాత్రమే పాల్గోనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అదేశాల మేరకు భారతదేశంలో అత్యంత అధునికమైన నీరా స్టాల్ ను హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవటంతో పాటు నీరా పాలసీని ప్రవేశ పేట్టి నీరా ను ఉత్పత్తి చేయటానికి గీత వృత్తి దారులకు మాత్రమే గీసుకోవటానికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కృతజ్ఢతలు తెలిపారు.

సిఎం కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అన్ని కుల వృత్తుల ఆత్మగౌరవ భవనాల కోసం వేల కోట్ల విలువైన భూములను కేటాయించారన్నారు. తరతరాలుగా లక్షలాది మంది కార్మికులు చెట్లు పన్ను ను ప్రభుత్వానికి చెల్లించినా చివరకి సమైఖ్య రాష్ట్రంలో గీత వృత్తిని నిషేదించాలని కుట్రలు చేసారన్నారు.

నేడు గీత వృత్తికి పూర్వ వైభవం తీసుకరావటానికి ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రవేశ పేట్టి గీత వృత్తిదారులకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
రాష్ట్రంలో ప్రతి గౌడ సోదరుడు కనీసం మూడు ఈత, తాటి మరియు గిరుక తాళ్ళు ( డాలర్ ట్రీ ) లను నాటి గీత వృత్తి ని కాపాడుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

leave your comment


Your email address will not be published.